MDR Foundation
Our mission focuses on doing crematory rituals for orphans and plethora of social
services for people
● గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్ ప్రెసిడెంట్ మధు.
● ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ కో-ఫౌండర్, మాదిరి ప్రిథ్వీరాజ్ గారు.
● రామచంద్రపురం పట్టణంలో గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన ౌండేషన్. మృతి చెందిన వ్యక్తికి నాలుగు రోజులైనా సంబంధించిన వాళ్ళు ఎవరూ రాకపోవడంతో ౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
యాచకుడికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు.
ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ కో-ఫౌండర్, పృథ్వీరాజ్ గారు.
పటాన్చెరువు పట్టణంలో యాచకుడిగా ఉంటున్న వ్యక్తికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్. మృతి చెందిన వ్యక్తికి మూడు రోజులైనా సంబంధించిన వివరాలు తెలియకపోగా, అతని సంబంధించిన వాళ్ళు ఎవరూ రాకపోవడంతో MDR ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందిన వ్యక్తిని కుటుంబ సభ్యునిగా భావించి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు.
ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్, పటాన్చెరువు మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్ రాజు గారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి, సంబంధించిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో అంతక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి నాలుగు రోజులైనా సంబంధించిన వివరాలు తెలియక పోగా, అతని సంబంధించిన వాళ్ళు ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
● ౌండేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు గారు.
● 2024 నూతన సంవత్సరం పురస్కరించుకొని ౌండేషన్ క్యాలెండర్ రూపొందించింది. ఫౌండేషన్ ఛైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు, కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు, అధ్యక్షులు మధుసూదన్ గారు కలిసి ఈ క్యాలండర్ ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.కార్యక్రమంలో ువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
*అనాథ శవాలకు... "ఆ నలుగురు" వీళ్లు!!.*
*కుళ్లిపోయిన శవానికి అంత్యక్రియలు.*
*అనాథ శవాలకు అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తూ ఎండీఆర్ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం కూడా కుళ్లిపోయే స్థితిలో వున్న అనాథ యువకుడికి అంత్యక్రియలు చేశారు. పటాన్ చెరు పట్టణంలోని ఏషియన్ పెయింట్స్ సంస్థ సమీపంలో సుమారు 35 ఏళ్ల యువకుడు నీటి గుంతలో పడి చనిపోయాడు. కుళ్ళిన వాసన రావడంతో పక్కనే వున్న సెక్యూరిటీ వాళ్లు చూసారు. అప్పటి వరకు యువకుడు మృతి చెందిన విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. నీటి గుంతలో కుళ్లిపోతున్న స్థితిలో వున్న శవం విషయం గురించి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడి సంబంధీకులు ఎవరూ రాక పోవడంతో ఎండీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఫౌండేషన్ అధ్యక్షులు మధుసూధన్ ఆ అనాథ యువకుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాదిరి దేవేందర్ రాజు గారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆర్థిక సాయం అందించారు. ఈ ఫౌండేషన్ సభ్యులు అనాథ శవాలకు ఆ నలుగురు తామై అంత్యక్రియలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.*
ఇంటి నిర్మాణానికి... దేవేందర్ రాజు గారు చేయూత!.
పటాన్చెరు పట్టణానికి చెందిన చాకలి బాలయ్యకు ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెట్టిన ఆయన కల నెరవేర్చేలా తమ వంతు సాయం అందించింది. స్లాబ్ వేయడానికి పూర్తి స్థాయిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న బాలయ్య బాధ తెలుసుకున్న ఎం.డీ.ఆర్ ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి రూ.36వేల విలువ చేసే 100సంచులు సిమెంట్ అందించారు. ఆగిపోతుందనుకున్న ఇంటి నిర్మాణం పూర్తి కానుండటంతో బాలయ్య కళ్లు ఆనందంతో మెరిశాయి. తన ఇంటి నిర్మాణం కోసం అండగా నిలిచిన ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాదిరి దేవేందర్ రాజు గారికి రుణపడి ఉంటానని ఆయన ఉద్వేగంగా అన్నారు. కార్యక్రమంలో ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు పాల్గోన్నారు.
● ఇంటి నిర్మాణానికి... " ౌండేషన్" చేయూత!!!
● ఇంటి నిర్మాణం మొదలు పెట్టి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబానికి MDRఫౌండేషన్ అండగా నిలిచింది. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలా తమ వంతుగా దేవేందర్ రాజు గారు 10,000/- ఆర్థిక సాయం అందించారు. పటాన్ చెరు బస్ స్టాండ్ వద్ద చెరుకు బండి నడుపుతూ జీవించే కొటేశ్వరి కుటుంబానికి "ఉండటానికి ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెట్టినం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే పని ఆగిపోయింది. మా బాధ తెలుసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ వాళ్లు డబ్బులు ఇచ్చారు. మాదిరి దేవేందర్ రాజు గారికి రుణపడి ఉంటామని కొటేశ్వరి కృతజ్ఞతలు తెలిపింది. కష్టాల్లో వున్నవారికి అండగా నిలిచేలా దేవేందర్ రాజు గారి చొరవతో ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నామని ౌండేషన్ ప్రెసిడెంట్ మధు సూదన్ తెలిపారు.
పటాన్చెరువు పట్టణంలోని అంజి ఇంటి నిర్మాణం కోసం 20,000/- రూపాయలు పటాన్చెరు మాజీ సర్పంచ్, MDR ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు గారి ఆర్థిక సహకారంతో ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు సిమెంట్ బ్యాగులను అందజేయడం జరిగింది. ౌండేషన్
Let’s Vote And Be A Citizen 🗳️
• అభాగ్యుల ముఖాల్లో... మతాబుల వెలుగులు!!
• ౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు గారి ఆర్థిక సహాయంతో 16 వేల రూపాయల టపాకాయలను చిన్నారులకు అందజేసిన ౌండేషన్ సభ్యులు.
• దీపావళి పండుగ సందర్బంగా ౌండేషన్ చిన్నారుల మోఖములు సంతోషంతో వెలిగేలా చేసింది. ౌండేషన్ అధ్యక్షుడు మధు ఆధ్వర్యంలో ఆదివారం బొల్లారంలోని డిజైర్ సొసైటీలోని పిల్లలకు బాణాసంచా పంపిణీ చేశారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏటా ఇదే విధంగా ఈ సొసైటీలోని చిన్నారులకు ౌండేషన్ ప్రతినిధులు టపాకాయలు అందిస్తున్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.ఈ సారీ తమను గుర్తుంచుకొని బాణాసంచా పంపించిన యువ నాయకుడు మాదిరి పృథ్వీరాజ్ గారికి డిజైర్ సొసైటీ ప్రతినిధులు, చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.
వివిధ ఘటనల్లో చనిపోయిన ఇద్దరి సంబంధించిన వివరాలు తెలియకపోవడంతో అనాధలుగా కాకుండా మేమున్నాము అని అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్.
● పటాన్ చెరువు నియోజకవర్గంలో స్థానిక కేంద్రంలో మరియు లక్డారం గ్రామంలో లభించిన గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని ఫౌండేషన్ తెలిపింది. ఎన్నో వ్రతాలు, క్షేత్రాలు తిరిగిన రానీ పుణ్యం గుర్తుతెలియని అనాధ శవాల అంత్యక్రియలు నిర్వహించడంలో దొరుకుతుందని, ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి ఆర్థిక సహకారంతో ఎందరో అభాగ్యులకు సొంతవారు ఉన్నాగాని పట్టించుకోని వారు కొందరైతే, మరికొందరు వాళ్ళ జీవిత గమ్యం ఏమిటో తెలియక ఎక్కడి నుంచో వచ్చి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోని, ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి అభాగ్యులకు అక్కున చేర్చుకొని సొంత వారిలా అన్ని తానై MDR ఫౌండేషన్ వారు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు.
● గత మూడు రోజులలో గుర్తుతెలియని మూడు అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్.
● పటాన్ చెరువు నియోజకవర్గంలో గుర్తుతెలియని మూడు అనాధ శవాలకు అంత్యక్రియలు చేసి సేవ కార్యక్రమాలలో ఎల్లప్పుడు ముందు ఉంటూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్న ౌండేషన్, సంస్థ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి ఆర్థిక సహకారంతో గత మూడు రోజులుగా ముగ్గురు అనాధ సేవలు అంటే మీరేం చేసి తన ఉదారతను చాటుకుంది. నియోజకవర్గంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్రల వారీగా పొట్ట చేత పట్టుకొని వలస కూలీలుగా పనిచేస్తూ అందరూ ఉండి కూడా ఎవరు లేని విధంగా అనివార్య కారణాలవల్ల అనాధలుగా ఏర్పడుతున్నారు. అలాంటి వారికి, విద్య, వైద్యం, వారి అవసరాల మేరకు సహయం చేస్తూ, సేవా దృక్పథంతో ౌండేషన్ ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
● అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్..
● పటాన్ చెరువు నియోజకవర్గంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా అన్న అంటే నేనున్నా అంటూ వారి అవసరాన్ని బట్టి ఆదుకుంటూ ఆపదలో కష్టంలో అక్కున చేర్చుకునే ౌండేషన్ బుధవారం రోజున అనారోగ్యంతో బాధపడుతున్న పటాన్ చెరువు స్థానిక గౌతమ్ నగర్ కాలనీ చెందిన రఫీ కుమారుడు ఆస్పటల్ ఖర్చుల నిమిత్తం తన వంతు ఆర్థిక సహాయం ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో ౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.
ౌండేషన్
ఓం నమశ్శివాయ::
ఎవరో తెల్వదు, ఎక్కడి నుంచి వచ్చి వచ్చిర్రో తెల్వదు.. జీవితంలో చివరి అంకం చావు.
ఆ శివుడు మా చేత నిర్వహిస్తున్న ఈ అనాధ శవాల అంత్యక్రియలు ఆగేది ఎప్పుడో...
ఒకే రోజు నాలుగు అనాధ శవాలకు, పటాన్చెరువు మాజీ సర్పంచ్, BRS రాష్ట్ర నాయకులు, ౌండేషన్ చైర్మన్, దేవేందర్ రాజు గారి ఆర్థిక సహాయంతో అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో వివిధ ప్రాంతాలలో జరిగిన విషాదాలలో మరణించిన నలుగురికి అంత్యక్రియలు నిర్వహించిన పటాన్చెరుకు చెందిన దేవేందర్ రాజు గారి ప్రోత్సాహకారంతో నడుస్తున్నటువంటి ౌండేషన్ అధ్యక్షుడు మధు మరియు ఆసిఫ్ ఆధ్వర్యంలో నలుగురికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.
● ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగికి కావాల్సిన రక్తం సరఫరా చేసిన ౌండేషన్.
● సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగి కి తెల్ల రక్త కణాలు అవసరం అవడంతో అతనికి సంబంధించిన వృద్ధ మహిళ ఉండడంతో రక్తం ఎక్కడి నుంచి తేవాలి ఎలా తెలవాలో తెలవక ఇబ్బంది పడుతున్న వారికి, సంగారెడ్డి లోని బ్లడ్ బ్యాంక్ నుంచి తేవడానికి ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ సల్మా మేడం గారు ౌండేషన్ కార్యాలయానికి ఫోన్ చేసి సంగారెడ్డి నుంచి తెల్ల రక్త కణాల వ్యక్తం తీసుకొని వస్తే అతని వైద్యానికి సహకరించిన వారు అవుతారని చెప్పగా, ఫౌండేషన్ సభ్యుడు ఆసిఫ్ సంగారెడ్డి వెళ్లి రక్తం తీసుకొని వచ్చి ఆసుపత్రిలో డాక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. చేసిన పని చిన్నదైనా, సమయానికి రక్తమందగా వైద్యానికి ఇబ్బంది జరుగుతుందని, డాక్టర్ తెలిపారు. వెంటనే స్పందించి సంగారెడ్డి వెళ్లి రక్తం తీసుకొచ్చిన ౌండేషన్ సభ్యులు ఆసిఫ్ కి ౌండేషన్ కు ఆసుపత్రి డాక్టర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
● సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్గారి సమక్షంలో సామాజిక సేవ అవార్డు.
● అరుదైన ఘనత దక్కించుకున్న ౌండేషన్.
● ౌండేషన్ సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ సమక్షంలో సామాజిక సేవ అవార్డు 15 ఆగస్టు 2023 (77వ) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందుకోవడం జరిగిందని ౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్ తెలిపారు. మాదిరి దేవేందర్ రాజు గారి అధ్యక్షతన మరియు ఆర్థిక సహకారంతో చేస్తున్న అద్భుతమైన సామాజిక కార్యక్రమాలకు రాష్ట్రంలోనే వినూత్నమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతు, అన్ని వర్గాల వారికి తమ శ్రేయ శక్తుల సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలువురుని రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షిస్తుతు తనదైన ముద్ర వేస్తూ పేద ప్రజల గుండెల్లో నిద్రపోతూ తనదైన స్టైల్ లో అభిమానం సంపాదించుకుంటున్న ౌండేషన్ కు ప్రభుత్వం తరఫున 15 ఆగస్టు సంగారెడ్డి లో నిర్వహించే(77వ) స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో అవార్డుల ప్రదానోత్సవనికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ శరత్ గారి సమక్షంలో అందుకోవడం జరుగుతుందని ఆనంద వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు వెనకనుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుతో మరింత సేవా కార్యక్రమాలు చేసే బాధ్యతను పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు.
● అందరూ ఉండి కూడా అనాధల చనిపోయిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్.
● ఆర్థిక సహాయం అందించిన ౌండేషన్ చైర్మన్, BRS రాష్ట్ర నాయకులు మాదిరి దేవేందర్ రాజు గారు.
● పెద్దలు ఏది చెప్పినా, ఏది చేసినా పిల్లల మంచి కోసమే అని గ్రహించలేక ఎవరినో ఒకరిని ప్రేమించి అతనికి ఇంతకుముందే పెళ్లి అయింది అని తెలిసిన ఇష్టపడి, రెండో పెళ్లి చేసుకొని వెస్ట్ బెంగాల్ నుంచి పటాన్చెరువు మండలం నందిగామ గ్రామాల్లో నివాసం ఉంటూ, ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మహిళ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. మహిళలకు సంబంధించిన తల్లిదండ్రులకు సమాచారం అందించగా ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంటనే మా బిడ్డ మరణించిందని, మేము శవాన్ని తీసుకెళ్లడానికి రాము అని చెప్పడంతో, ఉన్న భర్త కూడా మహిళ చనిపోగానే వదిలేసి పారిపోవడంతో అనాధగా మిగిలిన మహిళకు ౌండేషన్ మరియు నందిగామ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి తదితర యువకులు ఆధ్వర్యంలో అంతక్రియలు నిర్వహించాము.
ౌండేషన్
● బతుకుదెరువు కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి గత వారం అంత్యక్రియలు నిర్వహించిన పటాన్చెరు యువకులు.
● ఆర్థిక సహకారం అందించిన ౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు.
● ఒరిస్సా రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామం వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి గత వారం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా అంత్యక్రియలు కూడా చేసుకోలేని స్తోమత లేని వారికి, వివిధ మాధ్యమాల ద్వారా పటాన్చెరులో ఉండే గొల్ల ప్రభాకర్ యాదవ్, నితీష్ తదితర యువకులు, మిత్రులకు మిత్రుల ద్వారా పరిచయం ఉండగా, యువకులు అంత్యక్రియలు చేయాలని భావించగా, ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియని వారికి, ౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు గారు అండగా నిలిచి, పూర్తి ఆర్థిక సహకారం అందించారు. పట్టణ యువకులు ౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారికి కృతజ్ఞతలు తెలపారు.
ౌండేషన్
ఒకే రోజు ముగ్గురి అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ౌండేషన్.
ఆర్థిక సహాయం అందించిన Madiri Devender Raju గారు.
నియోజకవర్గంలోనే ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నా అంటూ ముందుకు వస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ౌండేషన్. ఒకేరోజు ముగ్గురి అనాధ శవాలు అంత్యక్రియలు చేసి మరోసారి ఔదార్యన్ని చాటారు. పటాన్చెరువు నియోజకవర్గంలో గుర్తుతెలియని ముగ్గురి అనాధ శవాలకు ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజ్ ఆర్థిక సహకారంతో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. అదేవిధంగా ఇలా ఎందరో మంది అభాగ్యులు సొంతవారు ఉన్న లేకపోయినా కనీసం మానవత దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు మానవ జీవితం ఇంతేనా అని బాధతో కొన్నిసార్లు తమ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తుంటాయని గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద మహోన్నతమైన కార్యక్రమం పూనుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అనాధ శవాల ఆత్మలు రుణపడి ఉంటాయని అన్నారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన ౌండేషన్.
నేటి సమాజంలో విద్యార్థుల విద్య అభ్యసించడం ఎంతో ముఖ్యం, రాష్ట్రానికి దేశానికి వారి సేవలు ఎంతో అవసరం అది దృష్టిలో పెట్టుకొని చదువుకోవడానికి ఆశ ఉన్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం, బాధాకరమైన విషయమే, ఇట్టి విషయాన్ని గమనించి పేద విద్యార్థులకు కనీస అవసరాలకు కావలసిన టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందివాలని ౌండేషన్ సంప్రదించగా, చైర్మన్ దేవేందర్ రాజు గారు స్పందించి వారి ఆర్థిక సహకారంతో వారికి కావాల్సిన పుస్తకాలు ౌండేషన్ కో-పౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ౌండేషన్ అధ్యక్షులు మధుసూదన్, విక్రమ్, జాన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి...
వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుందాం
మనల్నిమనం కాపాడుకుందాం.
● నేటి బాలలను ప్రయోజకులుగా చేసినప్పుడే నిజమైన స్వాతంత్రం
● విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ ౌండేషన్.
● పటాన్చెరువు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో ఆయన తనయుడు ౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థినిలకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలపై తల్లిదండ్రులు ఉన్న చిన్న చూపును పోగొట్టి బాలురకు ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, నేటి బాలలను కూడా విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అవరోధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాద్యాయులు, ఉపాధ్యాయులు, ౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్, విక్రమ్, వీరేశ్, జాన్, ఫౌండేషన్ సభ్యులు మరియు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
ౌండేషన్
● ఆడపిల్ల పెళ్లికి హార్దిక సహాయం అందించిన ౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు.
● పటాన్ చెరువు పట్టణంలో నివాసం ఉన్న మహమ్మద్ అబ్దుల్ నజీబ్ కూతురు వివాహానికి ౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి సహకారంతో ౌండేషన్ అధ్యక్షుడు మధుసూదన్ చేతుల మీదుగా అందించడం జరిగింది.
Click here to claim your Sponsored Listing.
MDR Foundation
Helping Hands Are Better Than Praying Lips
Videos (show all)
Contact the organization
Telephone
Website
Address
Hyderabad
502319
Ratanmoti Bhavan, JNTU Road, KPHB, OPP Manjeera Trinity
Hyderabad, 500032
Satya Sai Seva Old Age Home is a nonprofit organization that offers three meals daily to seniors in a difficult situation.
Hyderabad, 500016
This is Durham Business School's alumni fan page for it's Indian Local Association
RK Mutt Road, Next To Indira Park, Domalguda
Hyderabad
youth out there to make a difference.....
Hyderabad
Created with the intention of bringing together fellow Hyderabadis who share the same level of passion to be the change they want to see. Better Golconda was our flagship campaign ...
Flate# G2, New City Centre, Gulistan_sajjad Hyderabad Sindh Pkistan
Hyderabad, 71000
Indus Rural Development Organization is a NGO working on diffrent themes particulary on women emp
Chikoti Gardens, Begumpet
Hyderabad
"Youth Democratic Front"(युवा लोकतांत्रिक मोर्चा) is a New
Charchaman Jahanuma
Hyderabad, 500053
Become a Member- http://goo.gl/m5kssh Donation Box form- http://goo.gl/jo7VA2 Become Volunteer- http://goo.gl/i3oE6e Call +91-9703125468 for Donations!!
Hyderabad
Milana loosely translates to "to bridge together" in hindi. In that spirit, we hope to bridge toget
Hyderabad
|| nA mAdHava sAmo deVo na cha MadHva sAmo guruHu ||Hare Sarvothama!! Vayu Jeevothama!
502, Trendset Towers, Road No. 2, Banjara Hills
Hyderabad, 500034
Naandi Foundation is one of the largest and fastest growing social sector organisations in India working to make poverty history.
Hyderabad
Svechha is a non-profit organization managed mostly by volunteers. Svechha mainly focuses on children education, health and solar lamps to non electrified villages.