KCR Cult Army
KCR cult Fan base �
కోడి నాదే గుడ్డు నాదే 🤪🤪
టీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీ కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం పార్టీకి తీరని లోటు అని, టీఆర్ఎస్ పార్టీ సేవా దృక్పథం కలిగిన ఒక నాయకున్ని కోల్పోయిందని అన్నారు. పార్టీ ఇన్సూరెన్స్ విభాగం బాధ్యతగా వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా కేటీఆర్ లక్ష్మీనారాయణ సేవలను గుర్తుచేశారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో సవాళ్ళను అధిగమిస్తూ.. స్వరాష్ట్రంలో సమిష్టి కృషితో మన తెలంగాణ పురోగమిస్తోంది: మంత్రి శ్రీ కేటీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను., స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సిఎం తెలిపారు.
సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, వొక్కొక్కటిగా వోపికతో, దార్శనికతతో అవాంతరాలను లెక్కజేయకుండా సక్కదిద్దుకుంటూ వస్తున్నామని సిఎం అన్నారు. తెలంగాణ సమాజం.. తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.
ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి వున్నదన్నారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు, ఆసరా అందాల్సిన ప్రతివొక్క వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందన్నారు.
తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత ధీక్ష ఇమిడివున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని, అందుకు వారికి సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా ఉపద్రవం వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని సిఎం అన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారి తెలంగాణ గా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నూతనంగా ఏడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం
మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కొత్త గూడెం మరియు మంచిర్యాల జిల్లాల్లో 7 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ సంఖ్య కేవలం 4 కు మాత్రమే పరిమితమైంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి సంకల్పంతో 2014-18 కాలంలో ఏర్పాటుచేసిన 5 కళాశాలలు మరియు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ ఏడు
కళాశాలలతో కలుపుకొని ఆ సంఖ్యను మొత్తంగా 16 కి పెంచడం జరిగింది
శాసనసభలో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు.
Finance Minister Sri Thaneeru Harish Rao presented budget for the financial year 2021-2022.
మిత్రులందరికీ నమస్కారం
రంగారెడ్డి - హైదరాబాద్ - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. అర్హులైన మీ బంధుమిత్ర పట్టభద్రుల ఓటర్ల చేత, బ్యాలెట్ పేపర్లో నాలుగవ వరుసలో ఉన్న మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ఎస్ వాణీ దేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాలని విజ్ఞప్తి.