ఐ టీడీపీ రాజవరం - గంపలగూడెం మండలం
ఐ టీడీపీ తిరువూరు నియోజకవర్గం
*ఎన్టీఆర్ జిల్లా:*
*తిరువూరు నియోజకవర్గం:*
*అందరికీ నమస్కారం*
*రేపు అనగా ది.05/07/2024 శుక్రవారం ఉదయం 9 గం.లకు తిరువూరులో ఎమ్మెల్యే* *గారి కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో* *ప్రజా సమస్యలపై "ప్రజా దర్బార్ " కార్యక్రమం నిర్వహించబడుతుంది*
*నియోజకవర్గంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా* *విన్నవించుకుంటున్నాము*
*గ్రూపులో ఎవరైనా లేకపోయినా దయచేసి లేనివారికి తెలియపరిచి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఎమ్మెల్యే గారు తమరికి తెలియపరచమన్నారని* *విజ్ఞప్తి చేస్తున్నాము*
🙏
*ఇట్లు*
*ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి కార్యాలయం*
విద్యాసంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
Good Decision Lokesh 👍👍
AP Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక ఆదేశాలు.. వారందరికీ బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాదీవెన, వసతి దీవెవ బకాయిల కారణంగా సర్టిఫికేట్లు అందని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయాలన ఆదేశించింది. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్.. దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.3480 కోట్లు బకాయిల కారణంగా లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీల్లో ఉన్నాయన్నారు. అలాంటి వారికి సర్టిఫికేట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
బ్రేకింగ్ న్యూస్:
దేశ చరిత్రలో సంచలనం...!!
లబ్ది దారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం ఇదే మొదటి సారి కానుంది...!!
జూలై 1న సామాజిక పెన్షన్ లబ్ది దారుల ఇళ్ళవద్దే ₹7000 పెన్షన్ (నెలవారీ పెన్షన్ ₹4000 + ఏప్రిల్, మే,జూన్ నెలల బకాయి ₹3000) అందిస్తామనే ఎన్నికల హామీ మేరకు... తాడేపల్లి మండలం పెనుమాక లో పెన్షన్ లబ్ధి దారుల ఇంటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారని సమాచారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
నిజం గెలవాలి అని రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి
నిజాన్ని గెలిపించి
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ
అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న
శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులునింపుతూ అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
🔴 || BACK BENCH BATCH..||
⚪ అమరావతి
◽ అసెంబ్లీ లోచివరి వరస లో జగన్ సీటు నిజమేనా...❓
◽ ఏపి అసెంబ్లీ లో జగన్ రెడ్డి కి చివరి సీటు.... ❗
◽ ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపి అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
◽ అసెంబ్లీ చివరి వరుసలో సీటు కేటాయించే అవకాశం ఉందని సమాచారం....❓
"మన తిరువూరులో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్"
డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ తిరువూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు..ఉచిత కోచింగ్ సెంటర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రావొచ్చు ఈ గొప్ప సదవకాశాన్ని వినియెగించుకోగలరు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శావల దేవదత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ప్రాణ దానం చేస్తున్న నటసింహం హిందూపురం హ్యాట్రిక్ MLA మన నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
తిరువూరు ప్రజలకు కావాల్సింది….. త్రాగునీరు, సాగునీరు.
పేకాట క్లబ్బులు కాదు - Srinivasa Rao Kolikapudi
తిరువూరు చరిత్ర తిరగ రాయబోతున్నా - Dr. కొలికపూడి శ్రీనివాసరావు
కేశినేని శివనాథ్ ను కలిసిన తిరువూరు తెలుగుదేశం పార్టీ నాయకులు
విజయవాడ :
గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తిరువూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి మండలాధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు బుధవారం టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
వీరందరితో కేశినేని శివనాథ్ కలిసి మాట్లాడారు.
తిరువూరు లో జరిగిన ఎన్నికల సరళి గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్లో చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు కేశినేని శివనాథ్ ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, గంపల గూడెం మండలపార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, ఎ.కొండూరు మండలపార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, , తిరువూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు వెంకట నరిసిరెడ్డి, తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్,గంపలగూడెం క్లస్టర్ ఇన్చార్జ్ కొత్త రజనీకాంత్, సీనియర్ నాయకులు కిలార్ రమేష్, గద్దె వెంకన్న, డాక్టర్ జయసింహాలతో పాటు తదితరులు పాల్గొన్నారు.....
*కొలికపూడి*
అంబేద్కర్ ఆలోచనల వాడి
కారల్ మార్క్స్ సిద్ధాంతాల వేడి
సమత మమతల బడి
మంచితనం మానవత్వానికి గుడి
ఉద్యమాలలో అతనిదొక ఒరవడి
నీతి నిజాయితీల వెలుగుల జడి
స్నేహానికి విడిపోని ముడి
సాహసానికి కార్యసాధనలకు నారుమడి
రైతన్న కష్టాలను చూచి కరిగిన గుండె తడి
రాజధాని సాధనకు ఎత్తినాడు కాడి
సాధించి తీరుతాడు ప్రత్యర్థులతో పోరాడి
శత్రువులతో అంటాడు నిరంతరం
*ఢీ*
మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
*11/05/2024*
*యన్.టి.ఆర్.జిల్లా*
*తిరువూరు నియోజకవర్గం*
💐 *అందరికీ నమస్కారం* 💐
*రేపు అనగా ది 11/05/2024 తిరువూరు నియోజకవర్గ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి కార్యక్రమాల వివరాలు*
💐 *ఉదయం 7:00 గంటలకు విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారాలు పాల్గొంటారు*,💐
💐 *ఉదయం 10:00 గంటలకు విసన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాలు పాల్గొంటారు,*💐
💐 *ఉదయం 11:00 గంటలకు విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలోఎన్నికల ప్రచారాలు పాల్గొంటారు* 💐
💐 *మధ్యాహ్నం 1:00 గంటలకు లింగాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు*
💐 *మధ్యాహ్నం 2:00 గంటలకి సొబ్బాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు*💐
కావున తెలుగుదేశం ,బీజేపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము,,
*అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము*
*ఇట్లు*
*మీ ఉమ్మడి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గారి కార్యాలయం*
భానుడు భగ భగ... చంద్రుడు ధగ ధగ...
బాబుతోనే అన్నివర్గాలకు సంక్షేమం కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి..రూ.25 లక్షలు ఆరోగ్య బీమా || I am with Babu ✌✊||AndhraPradesh||
కూటమి మ్యానిఫెస్టో!
1.మెగా డీఎస్సీపై తొలి సంతకం
2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000
3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7.రూ.3000 నిరుద్యోగ భృతి
8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి
11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12.ఉచిత ఇసుక
13.అన్నా క్యాంటీన్లు
14.భూ హక్కు చట్టం రద్దు
15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
16.బీసీ రక్షణ చట్టం
17.పూర్ టూ రిచ్ పథకం
18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19.కరెంటు చార్జీలు పెంచం
20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
23.పెళ్లి కానుక రూ.1,00,000/-
24.విదేశీ విద్య పథకం
25.పండుగ కానుకలు...
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
"తిరువూరు డైనమిక్ లీడర్...శీనన్నే..!!"
"2024 ఎలక్షన్స్ లో తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి గెలవాలి..!!" 🔥🔥
తిరువూరు నియోజకవర్గం ప్రజల మనోగతం.. !! - తెలుగుదేశం గెలవాలి - అభివృద్ధి చేసుకోవాలి..!!" 🙏🙏
♦️కొలికపూడి గెలవాలి -తిరువూరు వెలగాలి.♦️
👉ఎన్టీఆర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన తిరువూరు నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే డైనమిక్ లీడర్, ముక్కుసూటి మనిషి "కొలికపూడి శీనన్న" తిరువూరు ఎమ్మెల్యే గా గెలవాలని తిరువూరు నియోజకవర్గ ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు.
👉తిరువూరు నియోజకవర్గంలో పట్టణం, పల్లెలలో ఎక్కడైనా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు గారికి అడుగడుగున ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. 🫶
👉ప్రతి ఇంట్లోని మహిళలు కొలికపూడి శ్రీనివాసరావుకు మంగళ హారతులు ఇచ్చి, పూలమాలలతో ప్రేమ పూర్వక స్వాగతం పలుకుతున్నారు. 🫶
👉తిరువూరు నియోజకవర్గ నైసర్గిక స్వరూపం, దీర్ఘకాలంగా ఇక్కడ నెలకొన్న అనేక సమస్యలపై అధ్యయనం చేసిన శ్రీనన్న ఎమ్మెల్యేగా వస్తేనే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
👉యువకుడు, విద్యావంతుడు, అభివృద్ధి కాముకుడు, ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
👉50 ఏళ్ల తిరువూరు నియోజకవర్గ చరిత్రలో ఎందరో ఎమ్మెల్యే గా గెలిచినా తిరువూరు నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధిలో వెనుకబాటు తానానికి గురైందని, ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం ఇప్పటికైనా యువరక్తం, చొచ్చుకు పోయే స్వభావం, నియోజకవర్గ అభివృద్ధి పట్ల అంకిత భావం కలిగిన నాయకులు కావాలని, అన్ని అర్హతలు కలిగిన దీటైన నాయకుడు, ముక్కుసూటి మనిషి కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందితే నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని యువకులు, రైతులు, మహిళలు, వృద్ధులతో సహా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
👉ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, పార్టీలు, ప్రాంతీయతను వదలి మార్పును కోరుకునే ప్రతి ఒక్కరూ "ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారికి" తమ సంపూర్ణ మద్దతు తెలపాలని, "సైకిల్ గుర్తుపై మీ ఓట్లు" వేసి కొలికపూడి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించి తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
తిరువూరు నియోజకవర్గ కూటమి ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు బారి ర్యాలీ తో నామినేషన్ దాఖలు చేసారు ..
మనిషివా..! నానీవా! అంటూ
నిలదీస్తున్న అమరావతి రైతులు
అమరావతి ప్రజారాజధాని రైతుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చాలా సందర్భాలతో చెప్పారు ఎంపీ కేశినేని నాని. తాజాగా ఆయన మూడు రాజధానుల మూడుముక్కలాట పార్టీలో చేరారు. ఇప్పుడు కేశినేని నానికి అమరావతి రియల్ ఎస్టేట్ కేపిటల్ అట! రైతులని రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా దూషిస్తున్నారు. ఇవి విన్న అమరావతి రైతులు ``నువ్వు మనిషివా! నానీవా!`` అంటూ నిలదీస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా
తిరువూరు నియోజకవర్గం
గంపలగూడెం మండలం
దుందిరాలపాడు గ్రామం
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా గ్రామా పార్టీ అధ్యక్షలు శ్రీ కళ్యాణం కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో లో జరుగుతున్న జన్మదిన వేడుకల లో పలువురు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కళ్యాణం భాస్కరరావు గారు, నమ రాంబాబు గారు, కాప సుధాకర్ గారు మరియు కార్యకర్తలు, ఎస్సీ కాలనీ వాసులు సుమారుగా 15 కుటుంబాలు అందరు కలిసి తిరువూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారి సమక్షం లో తెలుగుదేశం పార్టీ లోకి చేరారు ..
ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షలు శ్రీ కళ్యాణం కృష్ణయ్య గారు, చెరుకూరి రాజేశ్వర రావు గారు, రేగళ్ల వీరారెడ్డి గారు, మానుకొండ రామ కృష్ణ (MRK ) గారు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
ప్రచురణార్ధం 19-04-2024
ప్రత్యర్ధుల గుండెలు బేజారు...ఎన్డీయే కూటమి హుషారు
కేశినేని శివనాథ్ నామినేషన్ ఘట్టం
*విజయోత్సవాన్ని తలపించిన కేశినేని శివనాథ్ నామినేషన్ ర్యాలీ
*సబ్ కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేసిన శివనాథ్
*ర్యాలీలో పాల్గొన్న కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులు
*ర్యాలీలో పాల్గొన్న గద్దె...సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిన తంగిరాల సౌమ్య
*ప్రచార రథం పై తన మాటలతో ఆకట్టుకున్న నాగుల్ మీరా
* బుద్దా వెంకన్న డ్రైవింగ్ లో బుల్లెట్ ఎక్కి సందడి చేసిన శివనాథ్
*ఎన్టీఆర్ విగ్రహానికి, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళుర్పించిన శివనాథ్
*ఎన్టీఆర్ జిల్లా నుంచి వేలాదిగా తరలిచి వచ్చిన తెలుగుతమ్ముళ్లు
*వినాయకుడి గుడి దగ్గర నుంచి మొదలైన నామినేషన్ ర్యాలీ
*మంగళహారతిలిచ్చి విజయ తిలకం తెలుగు మహిళలు
*కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో ప్రార్థన చేసిన ముస్లిం మత పెద్దలు
*అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రార్థనలు నిర్వహించిన ఫాదర్స్
*ఎన్డీయే కూటమి కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయిన రోడ్లు
*విజయవాడ నగర వీధుల్లో టిడిపి, జనసేన, బిజెపి జెండా రెపరెపలు
*కేశినేని శివనాథ్ కి మద్దతు తెలిపిన ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు
*ర్యాలీలో పాల్గొన్న ఆటో కార్మికులు, అసంఘటిత శ్రామికులు
* పసుపు కండువా ఊపుతూ కార్యకర్తలను ఉత్సాహపర్చిన శివనాథ్
*కదిలొచ్చిన మహిళ లోకం...నామినేషన్ ర్యాలీలో భారీ జనసందోహం
*విజయవాడ గడ్డ కేశినేని చిన్ని అడ్డా అంటూ స్లోగన్స్
* ఫ్లై ఓవర్ పై నుంచి శివనాథ్ పైకి పూల వర్షం
*రోడ్డుకి ఇరువైపుల జెండాలతో స్వాగతం పలికిన ప్రజానీకం
విజయవాడ : కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లో విజయవాడ నగరవీధుల్లో పండుగ వాతావరణం కనిపించింది. అదే బిజెపి జనసేన బలపరిచిన విజయవాడ పార్లమెంట్ టిడిపి అభ్యర్ధి కేశినేని శివనాథ్ నామినేషన్ కార్యక్రమం...కనకదుర్గమ్మ కొండ కింద నుంచి బందరు రోడ్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జనసందోహం ఒకే మాట...ఒకే బాటగా ఎండను సైతం లెక్క చేయకుండా నడిచింది. విజయవాడనగర వీధులు ఎన్డీయే కూటమిలోని మూడు రంగుల జెండాలతో రెపరెపలాడాయి. ఓర్పుతో...ఓర్చుకొని...ఓర్చుకొని కట్టలు తెంచుకున్న ఆవేశం...ఉత్సాహంగా మారి ఓ ప్రవాహంగా పొంగి కేశినేని శివనాథ్ నామినేషన్ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది.విజయో త్సవాన్ని తలపించిన ఈ ర్యాలీ తెలుగుదేశం కార్యకర్తల్లోనే కాదు బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహాన్ని, ప్రత్యర్థుల గుండెల్లో బేజారును కలిగించిందని చెప్పాలి.
శుక్రవారం ఉదయం విజయవాడ టిడిపి ఎంపి అభ్యర్ధి కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు ఒక ప్రభంజనంలా సాగింది. విజయోత్సవ ర్యాలీని తలపించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆశీస్సలు అందుకోని..వేలాదిమంది ప్రజల ఆదరాభిమానాలతో, నినాదాల హోరుతో, జయ జయ ధ్వానాల మధ్య బందరు రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేశినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రపోజ్ చేయగా కేశినేని శివనాథ్ నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు.
గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ విజయవాడ పార్లమెంట్ కార్యాయలంలో శుక్రవారం ఉదయం కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులు...నామినేషన్ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ పెద్దల ఆశీర్వచనాలు శివనాథ్ అందుకున్నారు. అనంతరం బెంజి సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కనకదర్గమ్మ దర్శనం చేసుకున్నారు. అలాగే కొండ కింద వున్న హజ్రత్ సయ్యద్ షాహ్ ఖాదిరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి ప్రచార రథం ఎక్కారు..ప్రచార రథం ఎక్కటానికి ముందు ఎన్టీఆర్ జిల్లా మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో తెలుగు మహిళ సంఘం నాయకులు వరుసుగా నిలబడి మంగళ హారతులిచ్చి...విజయతిలకం దిద్దారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుల్లెట్ బండి నడపగా, దానిపై శివనాథ్ కూర్చొని కండువా గాల్లో ఊపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎన్డీయే నాయకులు ప్రతి సెంటర్ లో గజమాలతో శివనాథ్ కి స్వాగతం పలికారు.
వినాయకుడి గుడి దగ్గర ప్రచార రధం ఎక్కిన శివనాథ్ ప్రజలకు అభివాదం చేస్తూ భారీ జనసందోహం మధ్య కదిలింది. ప్రచార రథంపై శివనాథ్ తో పాటు జిల్లాపార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి గద్దె రామ్మోహన్, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబిరామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కె.నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,ఎమ్.ఎస్. బేగ్ బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్..జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు వుండి కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపారు.
కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ దగ్గరకి ర్యాలీ వచ్చిన సమయంలో ఫైఓవర్ పై నుంచి ప్రచార రధం పైకి పూల వర్షం కురిపించారు. అలాగే రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ మస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించి..ఆశీస్సులు అందించారు. ఈ ర్యాలీలో ఆటో కార్మికులు, అసంఘటిత శ్రామికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. అలాగే ఎపి ఎమ్మార్పిఎస్ నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని శివనాథ్ కు మద్దతు అందించారు. తమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురువున్న అంబేడ్కర్ విగ్రహానికి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం ఆధ్వర్యంలో శివనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అప్పికట్ల జవాహర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఫాదర్స్ తో ప్రార్ధనలు జరిపించి జపమాల బహుకరించారు. సమయ బావం కావటంతో పాత బస్టాండ్ సెంటర్ నుంచి ప్రచార రథం దిగి...కారులో సబ్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లిఅక్కడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను కలుపుకుని .నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసి వచ్చే సమయంలో నందిగామ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి తంగిరాల సౌమ్య శివనాథ్ ను కలిసి అభినందనలు తెలియజేశారు.
జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యం : కేశినేని శివనాథ్
ఎన్టీఆర్ జిల్లాలో సగటు సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచేవిధంగా కృషి చేస్తానని కేశినేని శివనాథ్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతానని, జిల్లాలోని ఏడు నియోజకవర్గాలో ఎన్డీయే అభ్యర్ధుల్ని గెలిపించి కానుకగా అందిస్తానని తెలియజేశారు. ఈ ప్రయాణంలో అండగా నిలబడిన కార్యకర్తలకు ఎప్పుడు తోడుగా వుంటానని చెప్పారు. ఏడు నియోజవర్గాలనుంచి వచ్చిన ఎన్డీయే నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నామినేషన్ ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందని..ఈ ర్యాలీ చూసి ప్రత్యర్ధుల గుండెల్లో వణుకు మొదలైందని...వైసిపి పై ఎంత వ్యతిరేక వుందో ర్యాలీకి వచ్చిన ప్రజానీకాన్ని చూస్తే అర్ధమైవుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీయే కూటమి రాబోతుందన్నారు. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్దిని చంద్రబాబు నాయకత్వంలో...మోదీ సహకారంతో గాడిన పెడతామని చెప్పారు. రాష్ట్రంలో చాలా సమస్యలు వున్నాయి..వాటిని పరిష్కరించటంతోపాటు యువతకి ఉద్యోగాలు, అమరావతి రాజధాని , పోలవరం నిర్మాణం త్వరిగతిన చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అలాగే త్వరలో లోకల్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ఇత్తడి చార్లెస్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీముల్లా, చెన్నుపాటి శ్రీను, కాకు మల్లిఖార్జున యాదవ్, వెనిగళ్ల రాము, తిరువూరు నియోజవకర్గ టిడిపి నాయకులు శావల దేవదత్తు, బిసి నాయకురాలు నూకాలమ్మ, జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ వంశీలతోపాటు ఏడు నియోజకవర్గాల బిజెపి, టిడిపి, జనసేన పార్టీ ఇన్ చార్జులు, మండలాధ్యక్షులు, గ్రామ సర్పంచులు, మహిళనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*అంగన్వాడీ లకు కూడా భయపడుతున్న సీఎం !!*
*ది : 14/12/2023*
*ఎన్టీఆర్ జిల్లా*
*తిరువూరు నియోజకవర్గం*
*గంపలగూడెం మండలం*
*పెద్ద కొమిర గ్రామం*
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్నధర్నా మూడోవ రోజుకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టి రికార్డులు స్వాధీనం చేసుకో మాని ఆదేశాల అనుసారం, *పెద్ద కొమిరా గ్రామం తోట మూల అంగన్వాడీ సెంటర్ -91* వద్దకు వచ్చినా సచివాలయ సిబ్బందిని ఆడుకొని తాళాలు పగలగొట్టకుండా నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ...
ఈ కార్యకమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు *దిరిశాల వెంకట కృష్ణ రావు గారు*, మండల పార్టీ ఉపాధ్యక్షలు *ఇనుగంటి మధుసూదన్ రావు* గారు, గ్రామ ఎంపీటీసీ సభ్యులు *దొంతల బుచ్చిరామయ్య గారు*, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ *షైక్ సైదులు గారు.*