L Ramana
MLC Karimnagar (Local Authorities)
Ex.MP-Karimnagar, Ex.Minister-Textiles, Ex.MLA-Jagtial
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం
🧵 చేనేత కార్మికులకు మరింత అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం! 🧵
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలుచేస్తున్న చేనేత మిత్ర పథకంలో భాగంగా అర్హులైన నేతన్నలకు నెలకు ₹3వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. శుక్రవారం (సెప్టెంబర్ 1) నుంచి నేతన్నల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి.
నా జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు #శ్రీ_కల్వకుంట్ల_చంద్రశేఖర్_రావు_గారికి, శాసనమండలి సభ్యురాలు #శ్రీమతి_కల్వకుంట్ల_కవిత_గారికి, సహచర ప్రజా ప్రతినిధులకు, #భారత_రాష్ట్ర_సమితి నాయకులకు, కార్యకర్తలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదములు.
Telangana CMO
Kalvakuntla Kavitha
KCR
BRS Party
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగిన పద్మశాలి యుద్ధభేరి కార్యక్రమంలో నా ప్రసంగం.....
పద్మశాలిల తీర్మానాలను అమలు చేసే బాధ్యత మాది | Teenmarmallanna | Qnews QnewsEnglish: https://www.youtube.com/-xr1qf ► Shanarth...
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు... తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్ లో బుధవారం నాడు సీఎం కేసీఆర్ గారు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. ‘‘ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల, కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణ కు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది తో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీనుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో... సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
జగిత్యాల జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుండి నిధులు మంజూరు చేయించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నివాసంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గార్లతో కలిసి జగిత్యాల జిల్లా లో పలు అభివృద్ధి పనులు,స్థానిక అంశాలపై చర్చించడం జరిగింది.
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధుల మంజూరు గురించి ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని స్థానిక శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ గారితో కలిసి చర్చించడం జరిగింది.
జగిత్యాల జిల్లా మల్యాల్ మండలంలోని కొండగట్టుపైకి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు పంపించే కార్యక్రమానికి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు సుంకే రవి శంకర్ గారు, జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భక్తులకు నిరంతరం నీటి సౌకర్యం కలిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం.
బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంప గోవర్ధన్, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ లతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.
15-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి నివాళి అర్పించిన మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, శాసనసభ్యులు మరియు ఇతర ప్రముఖులు
14-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి నివాళి అర్పించిన ప్రముఖులు
13-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి నివాళి అర్పించిన ప్రముఖులు
12-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి నివాళి అర్పించిన ప్రముఖులు
ఎం ఎల్ సి కవిత పరామర్శ
10-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి ప్రముఖుల పరామర్శ
10-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నివాళి
09-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి నివాళి అర్పిస్తున్న ప్రముఖులు
07-07-2023
కీ.శే. ఎల్ జీ.రామ్ గారికి ప్రముఖుల నివాళి
06-07-2023
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి ప్రముఖుల నివాళి
కీ.శే. ఎల్.జీ.రామ్ గారికి ప్రముఖుల నివాళి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, శాసనమండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ గారు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారు ఎల్.జీ.రామ్ గారి పార్ధీవ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
మా తండ్రి శ్రీ ఎల్.గంగారాం గారు 03-07-2023 సోమవారం అర్ధరాత్రి 1:10 నిమిషాలకు (తెల్లవారితే 04-07-2023) అనారోగ్యంతో మా స్వగృహం జగిత్యాలలో తుది శ్వాస విడిచారు.
భారతరత్న పీ.వీ.నరసింహారావు గారి 102 వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ...
భారత దేశ మాజీ ప్రధాని భారత రత్న కీ.శే. పీ.వీ.నరసింహారావు గారి 102 వ జయంతి సందర్భంగా అసెంబ్లీ లో నివాళి అర్పించిన అనంతరం మీడియా సమావేశంలో....
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ని గుర్తు చేసుకున్న కేసిఆర్
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ సంస్మరణ సభలో వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ...