Shaik Abdul Aziz
Official Page Of Shaik Abdul Aziz, Nellore Parliament TDP President
టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి అభ్యున్నతికి కృషి చేస్తాం - అబ్దుల్ అజీజ్
తెలుగుదేశం పార్టీ బీసీ ల పార్టీ - అబ్దుల్ అజీజ్
వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది...
ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వైసిపికి ఎమ్మెల్యేలు ఎంపీ లు గుడ్ బై చెపుతున్నారు.
ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కిన జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు..
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు..
నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీ నందు నెల్లూరు నగర నియోజకవర్గ 28 డివిజన్ ల ముఖ్య నేతలతో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధుల నియామకం పై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ...
వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించిన వైసిపి ఎమ్మెల్యేలు ఎంపీ లు వైసిపి కి రాజీనామా చేస్తున్నారని అన్నారు...
వైసిపి అధికారం చేపట్టాక ఏపీ అభివృద్ధి పదేళ్లు వెనక్కి నెట్టబడిందని, వైసిపి ప్రజలకు చెప్పుకునేందుకు కూడా ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని, ప్రజా సేవ చేయడంలో వైసిపి పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు..
ఒక్క ఛాన్స్ పేరుతో గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, నిర్దాక్షిణ్యంగా యధేచ్ఛగా ప్రజలను దోపిడీ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు
రాబోవు ఎన్నికల్లో వైసిపి కి ప్రజలు బుద్ధి చెప్పడం, టీడీపి కి అధికారాన్ని ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు..
సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, రాష్ట్ర కార్యదర్శి రాజా నాయుడు, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కువ్వారపు బాలాజీ, జహీర్, తిరుమల నాయుడు, అన్నంగి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
'నిజం గెలవాలి' పర్యటనలను పునఃప్రారంభించనున్న నారా భువనేశ్వరి గారు.. జనవరి 3, 4, 5 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలు
కిటకిటలాడిన అబ్దుల్ అజీజ్ నివాసం
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సరం సందర్భంగా హరనాథపురంలోని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నివాసం అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో కిటకిటలాడింది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన నేతలు కార్యకర్తలు అబ్దుల్ అజీజ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి గజమాలలు శాలువాలు బొకే లతో ఘనంగా సత్కరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు..
ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాలకు చోటిద్దాం...
నూతన సంవత్సరమంటే తేదీ మారడం కాదు.....
జిల్లా ప్రజలకు 2024 నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు...
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు...
నెల్లూరు జిల్లా ప్రజలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాలకు చోటివ్వాలని, సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. నూతన సంవత్సరం అంటే కేవలం తేదీ మారటం కాదని మన ప్రగతిని సమీక్షించుకునే సమయమని, లక్ష్యసాధనకు పునరంకితం కావాలని అన్నారు.
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు,యువత నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళికతో ముందుకు సాగాలని, ఏర్పరుచుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలని సూచించారు...
జీ పీ ఆర్ లో ముస్లిం ఇన్ఫ్లుఎన్సర్ లతో సమావేశం...
హజరైన వివిధ వర్గాల మైనార్టీలు...
నెల్లూరు నగరంలోని జీ పీ ఆర్ కళ్యాణమండపం లో ముస్లిం సామాజికవర్గ ఇన్ఫ్లుఎన్సర్ లతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ శాసన మండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముష్ఠాక్ అహమద్, డ్యాన్స్ మాస్టర్ జానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశం లో వివిధ వర్గాల ముస్లిం లు పాల్గొన్నారు. వారితో నాయకులు ముఖాముఖి నిర్వహించారు. ఇన్ఫ్లుఎన్సర్ లు వేసిన ప్రశ్నలకు నేతలు సమాధానాలు చెప్పారు. వారి సమస్యలు తెలుసుకుని టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
జీ పీ ఆర్ లో ముస్లిం ల ఆత్మీయ సదస్సు..
నెల్లూరు నగరంలో లోని జీపీఆర్ కళ్యాణమండపంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిలు నారాయణ, శ్రీధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఇరు నియోజకవర్గాల ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది..
కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, టిడిపి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మూలాన ముష్ఠాక్ అహమద్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు...
ఈ సందర్భంగా మహమ్మద్ అహమద్ షరీఫ్ మాట్లాడుతూ...
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ముస్లింల స్థితిగతులు కాస్తయినా మారలేదని అన్నారు..
రాజ్యాంగం కలిగించిన ఓటు హక్కును నూటికి నూరు శాతం ఉపయోగించుకునే ఏకైక సామాజిక వర్గం ముస్లిం సామాజికవర్గమని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అది ముస్లిం ఓట్ల బలంతోనేనని అన్నారు...
రాష్ట్రంలో దాదాపు 50 నియోజకవర్గాల్లో ముస్లిం సామాజికవర్గ ఓటర్లు గెలుపు ఓటములను శాసిస్తున్నారని అన్నారు...
లౌకికవాదాన్ని మతసామరస్యాన్ని కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ముస్లింల ప్రాణ మాన ఆస్తులను కాపాడటమే చంద్రబాబు లక్ష్యం అని అన్నారు...
తన రెండు కళ్ళలో ఒక కన్ను ముస్లింలు ఒక కన్ను హిందువులని చెప్పిన నాయకుడు చంద్రబాబు అని, వైసిపి మాత్రం బిజెపికి తొత్తులుగా మారి బిజెపి ఏం చెప్తే అది చేస్తున్నారని అన్నారు..
ఎన్ఆర్సికి మద్దతు పలికి ముస్లిం ప్రయోజనాలను తాకట్టుపెట్టిన వైసీపీకి ముస్లింలను ఓటు అడిగి అర్హత లేదని అన్నారు..
ముస్లింలకు ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి అధిక శాతంలో లోన్లను ఇప్పించిన ఘనత చంద్రబాబు ది అన్నారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ముస్లిం ప్రజానికానికి టిడిపి చేసిన మంచిని వైసీపీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం మనందరిపైనా ఉందని అన్నారు..
ప్రజలు పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు....
ప్రజావేదికతో కూల్చివేతతో ప్రారంభమైన అరాచక పాలన ప్రజల ఆస్తులు సైతం ధ్వంసం చేసే వరకు వచ్చిందని అన్నారు..
పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకలో ప్రభుత్వాలు మారిన అన్న క్యాంటీన్ కొనసాగిస్తున్నారని తెలిపారు..
ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలు చిద్రం కాకుండా మేలు చేయాలన్న ఆలోచనతో చంద్రన్న భీమా తీసుకుని వచ్చారని దానిని సైతం అపేసిన పైశాచిక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు...
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు గా నారాయణ, కోటంరెడ్డి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...
వైసిపి ప్రభుత్వం సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి పేదవారి దగ్గరనుంచి వివిధ రూపాల్లో 100 రూపాయలు లాగిస్తున్నారని విమర్శించారు..
ఆంధ్ర రాష్ట్రంలో నిత్యావసరాలు, కరెంట్ చార్జీలు అత్యధికంగా పెరిగాయని, ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ బిల్లు తాకితే షాక్ కొడుతుందని విమర్శించారు
మంచి పరిపాలన రావాలంటే సంక్షేమం అభివృద్ధి సమానంగా అమలు కావాలంటే టిడిపి అధికారంలోకి రావాలని అందుకోసం ప్రతి కార్యకర్త కష్టించి పని చేయాలని సూచించారు..
దేశంలో ఎన్ ఆర్ సి ఎన్ పి ఆర్ చట్టాలు వచ్చినప్పుడు వ్యతిరేకించిన ఏకైక ఎమ్మెల్యే తాను ఒక్కడినేనని ఉద్యమాన్ని ఆపకపోతే బుల్లెట్ల తో కాలుస్తామని బెదిరించిన పోరాటాన్ని ఆపలేదని అన్నారు..
ఎన్ఆర్సి సమయంలో తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేశారని, కష్టకాలంలో ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా మౌలానా ముష్టాక్ అహమద్ మాట్లాడుతూ...
వైసిపికి ముస్లింల పై కపట ప్రేమని చూపిస్తున్నారని టిడిపి హయాంలో నిర్మించిన హజ్ హౌస్ ముస్లిం లకు ఉపయోగపడకుండా వాటికి తాళాలు వేశారని విమర్శించారు..
డిప్యూటీ సీఎం అంజాధ్ బాషా మతపరమైన సదస్సులో గొప్పలు చెప్పడం తప్ప సమాజానికి చేసింది ఏమీ లేదని, మైనార్టీలపై దాడులు, అన్యాయం జరిగినా స్పందించిన దాఖలాలు లేవని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు...
వైసిపి చేసేది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదని సామాజిక ద్రోహ బస్సుయాత్ర అని పేర్కొన్నారు. ముస్లిం సమాజం విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని అలాంటి వ్యక్తిని గద్దె దింపాల్సిన అవసరం ఉందని అన్నారు...
కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, పార్లమెంట్ మైనార్టీ అద్యక్షులు మొయినుద్దీన్, నగర అధ్యక్షులు మామీదాల మధు, నగర నియోజకవర్గ పరిశీలకులు కరిముల్లా, నన్నే సాహెబ్, జాఫర్ షరీఫ్, హయాద్ బాబా, ఇక్బాల్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
సమాజ మార్పు లో మహిళల పాత్ర కీలకం.
మార్పు కోసం ముందుకు వచ్చిన మహిళలకు అభినందనలు.
- షేక్. అబ్దుల్ అజీజ్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ 40, 42, 43, 45 డివిజన్ ల మహిళా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, సమాజంలో మార్పు రావాలంటే అత్యధిక శాతం మహిళలతోనే సాధ్యమవుతుందని, మార్పులో కీలక పాత్ర మహిళలదేనని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ పరిస్థితులను మార్చే బాధ్యత ను ప్రతి మహిళా ఏదో ఒక రూపంలో తీసుకోవాలని అన్నారు. మార్పు కోసం ముందుకు వచ్చి టీడీపీ తో పని చేస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. రాక్షస పాలన గురించి, రాష్ట్రానికి చంద్రబాబు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించి రాష్ట్ర పరిస్థితుల మార్పు కు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, జాఫర్ షరీఫ్, పుట్టా అజయ్, జాఫర్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు
ముస్లిం లకు వైసీపీ చేసిన ద్రోహాన్ని, టీడీపీ చేసిన మంచిని వివరిస్తాం - అబ్దుల్ అజీజ్
రేపు ఉదయం 10 గంటలకు జిపిఆర్ లో ముస్లింల ఆత్మీయ సదస్సు...
ముస్లిం లకు వైసిపి చేసిన ద్రోహాన్ని, టీడీపి చేసిన మంచిని వివరిస్తాం...
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు...
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాల మైనార్టీ నేతలతో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి లు సమావేశం నిర్వహించారు.
అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియా తో మాట్లాడుతూ..
రేపు జిపిఆర్ కళ్యాణమండపం లో నెల్లూరు నగర మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల ఇంఛార్జిలు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సదస్సు జరగనుందని తెలిపారు..
ముస్లింల కోసం టిడిపి ప్రవేశపెట్టిన, వైసిపి రద్దు చేసిన సంక్షేమాల గురించి వివరిస్తామని, మైనార్టీల కోసం నిష్పక్షపాతంగా పని చేసే పార్టీ ఏదో వివరిస్తామని తెలిపారు...
గతంలో ముస్లిం ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు చేసేవారని, అలా పెళ్లిళ్లు చేసుకోవడానికి అనేకమంది ఇబ్బందులు పడేవారని ఆ పరిస్థితులను అర్థం చేసుకుని చంద్రబాబు దుల్హన్ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు..
మైనార్టీ సామాజికవర్గం కోటి ఆశలతో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని, వారి ఆశల ను జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని అన్నారు..
వైసిపి దౌర్జన్యకాండ వల్ల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని. వారి కుటుంబాన్ని పరామర్శించిన విధానం చూస్తే జగన్మోహన్ రెడ్డి స్వభావం బయటపడుతుందని అన్నారు.
మైనార్టీ సామాజిక వర్గంలో చేతివృత్తుల వారు ఎక్కువ ఉన్నారని రెక్క ఆడితే తప్ప డొక్క ఆడని పరిస్థితిలో ఉన్నారని వారి అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామనేది స్పష్టమైన హామీలతో చెబుతామని అన్నారు..
కార్యక్రమంలో నెల్లూరు రూరల్ టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మైనుద్దిన్, నన్నే సాహెబ్, హయాత్ బాబా, సాబీర్ ఖాన్, నియామతుల్ల, ఇక్బాల్, జాఫర్ మొహిద్దిన్, రసూల్, అమ్రుల్లా తదితరులు పాల్గొన్నారు...
టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమానికి అభివృద్ధి కి సమాన ప్రాధాన్యత ఉంటుంది...
మహిళల అభ్యున్నతే టీడీపీ ప్రధాన అజెండా..
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు 39 వ డివిజన్ టీడీపీ మహిళా కార్యకర్తలతో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు కీలక అంశాల పై దిశానిర్దేశం చేశారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఉంటుందని అది ప్రజలకు తెలియపరచాలని అన్నారు. మహిళల అభ్యున్నతే టిడిపి యొక్క ప్రధాన అజెండా అని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, క్లస్టర్ ఇంఛార్జి అన్నంగి ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదరులకు, నెల్లూరు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుల....
నెల్లూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రీ క్రిస్మస్ సంబరాలు
టిడిపి కార్యాలయంలో అంబరాన్నంటిన ప్రీ క్రిస్మస్ సంబరాలు...
పాస్టర్లకు దుస్తులు పంపిణీ...
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, అబ్దుల్ అజీజ్ పెద్ద ఎత్తున ప్రీ క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి వూరందూరు సురేంద్ర బాబు అధ్యక్షత వహించారు.
పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసుప్రభువు గీతాలాపనలు, చిన్న పిల్లల నృత్యాలు అలరింపచేశాయి. ఫాదర్ జోసెఫ్, రెవరెంట్ బిల్లా విల్సన్ బాబు లు దైవ సందేశాన్ని అందించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, పలువురు పాస్టర్ లకు చిరుకానుక గా దుస్తులు అందచేశారు..
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ...
టిడిపి హయాంలో పేద క్రిస్టియన్లు పండుగ చేసుకునేందుకు క్రిస్మస్ కానుకను అందించేవారమని వైసిపి ప్రభుత్వాన్ని దానిని ఆపేసిందని తెలిపారు.
జగన్ మోహన్ ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని యేసుక్రీస్తు బోధనలలో శత్రువు ను కూడా ప్రేమించాలని ఉందని తెలిపారని, కానీ ఆయన దానికి విరుద్ధంగా చేస్తున్నారని అన్నారు.
టిడిపి హయాంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కోసం అల్లిపురంలో స్థలం కేటాయించామని తెలిపారు..
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ...
క్రిస్మస్ పర్వదినాన క్రిస్టియన్ సోదరుల ప్రార్థనల తో యేసు ప్రభువు ద్వారా చంద్రబాబు కు చల్లని దీవెనలు ఆశీర్వాదాలు అందాలని ఆకాంక్షించారు..
ఈ సందర్భంగా పనభాక లక్ష్మీ మాట్లాడుతూ...
తన బాల్యంలో విద్యాభ్యాసం మొత్తం ఏబీఎం స్కూల్ లో జరిగిందని ఈ ప్రీ క్రిస్మస్ వేడుకల ద్వారా తన బాల్యం మళ్ళీ గుర్తొచ్చిందని అన్నారు..
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ప్రతి ఏడాది రాజకీయాలకతీతంగా ప్రీ క్రిస్మస్ సంబరాలు నిర్వహించి పాస్టర్లను గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తామని తెలిపారు...
ఎప్పుడూ పిలిచినా మీరందరూ రాము రాలేము అని చెప్పిన దాఖలాలు లేవని, మీ అందరికీ ఒక వ్యక్తిగా, పార్టీగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు..
టిడిపి హయాంలో నిర్మించ తలపెట్టిన బాప్తిజం ఘాట్ వైసిపి ప్రభుత్వ రాకతో ఆగిపోయిందని అన్నారు. దుర్మార్గపు ఆలోచనలు కలిగిన ఏ రాజు క్రైస్తవుడు కాలేడని అన్నారు...
కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, రాజా నాయుడు, పనబాక భూ లక్ష్మి, పాల్ కోటి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు...
అజీజ్ కు ఫాదర్ జోసెఫ్ దీవెనలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను హరినాధపురంలోని వారి నివాసంలో ఫాదర్ జోసెఫ్ మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు.
చంద్రబాబు తప్ప రాష్ట్రాన్ని మరెవరూ బాగుచేయలేరు...
చంద్రబాబు అనుభవం, యువశక్తి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రం గాడిలో పడనుంది...
పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన దౌర్భాగ్య రాజు జగన్మోహన్ రెడ్డి....
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
నెల్లూరు నగరంలోని జిపిఆర్ కళ్యాణమండపం నందు సీ బీ ఎన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సింహపురి స్త్రీ శక్తి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు హజరయ్యారు...
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూనే రాష్ట్రం భవిత కోసం ముందుకు రావడం సంతోషమని అన్నారు. చంద్రబాబు విజన్ 2020 లబ్ధి పొందిన వీరు విజన్ 2024 తో భావి తరాలు లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని సీబీఎన్ ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్య పరుస్తున్నారని అన్నారు.
పార్టీని స్థాపించి ఆడబిడ్డలకు ఆస్తి లో సమాన హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు..
అందరి కుటుంబాల్లో ఎన్నో సంక్షోభాలు వస్తూ పోతుంటాయని వాటిని అధిగమించి కుటుంబాన్ని గాడిలో పెట్టగల శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉందని అన్నారు..
జగన్మోహన్ రెడ్డి అతని ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఇర్రిపెరబుల్ డ్యామేజ్ చేశారని, సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నారు రాష్ట్రాన్ని కాపాడలేరని కేవలం అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రమే సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని అన్నారు...
చంద్రబాబు అనుభవం యువ శక్తి నారా లోకేష్ కాంబినేషన్లో ఆంధ్ర రాష్ట్రం గడిలో పడనుందని పేద ప్రజలకు మంచి రోజులు రానున్నాయని తెలిపారు...
పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ నిర్వీర్యం చేసిన దౌర్భాగ్య రాజు, చంద్రన్న బీమా ను ఎత్తివేసిన సైకో రాజు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి, నారాయణ సతీమణి రమ, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, మాజీ మేయర్ భాను శ్రీ, తదితరులు పాల్గొన్నారు...
చంద్రబాబు తప్ప రాష్ట్రాన్ని మరెవరూ కాపాడలేరు - అబ్దుల్ అజీజ్
హత్యలు, రౌడీయిజాలు చేస్తున్న వారిని వైసిపి పెంచి పోషిస్తుంది - అబ్దుల్ అజీజ్
అజ్ఞానాన్ని సంహరించి జ్ఞానాన్ని ప్రసాదించే పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి, ఈ పర్వదినాన ఆ శ్రీ మన్నారాయనుని ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...
- షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు...
రేపు ఉదయం నెల్లూరు నగరంలోని జీ పీ ఆర్ కళ్యాణ మండపం లో సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సింహపురి స్త్రీ శక్తి కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను ఆహ్వానించిన ఫోరం సభ్యులు..
గున్నయ్య కు అజీజ్ పరామర్శ...
త్వరగా కోలుకోవాలని కాంక్ష...
ఇటీవల కాలంలో గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి గున్నయ్య ను నెల్లూరు రూరల్ మండలంలోని మాదరాజు గూడూరు గ్రామంలో గల వారి నివాసంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గున్నయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. వారితో పాటు నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్ ఉన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే మన బిడ్డల భవిష్యత్తు మారినట్టే...
- అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
టీడీపీ అధికారంలోకి వస్తే మన బిడ్డల భవిష్యత్తు మారినట్లేనని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు బుధవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో కలిసి 3,4,6,8,9,10 డివిజన్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గత ఎన్నికలకు నేటి ఎన్నికలకు భూమి ఆకాశానికి ఉన్న తేడా ఉందని, నేటి ఎన్నికలు పూర్తి గా కార్పొరేట్ ఎన్నికలు అయిపోయాయని అన్నారు. మన కర్మలను బట్టే ఫలితాలు ఉంటాయని మనం చేసే పనులను బట్టే మన భవిష్యత్తు మారబోతోంది అని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కు కృషి చేయాలని సూచించారు.
10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేరన్న పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయింది - అబ్దుల్ అజీజ్
అక్రమ మైనింగ్ పై అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం
రండి... చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవ్వండి!
ఒకే వేదికపై తిరుగులేని ప్రజా నాయకుల అపూర్వ సంగమం. విశాఖలో యువగళం- నవశకం కార్యక్రమ వేదిక పై తెలుగుదేశం, జనసేన అధినేతలు.
టీడీపీ కి యానాది శెట్టి లోటు ఎవరూ పూడ్చలేరు - అబ్దుల్ అజీజ్
యానాదిశెట్టి కి అబ్దుల్ అజీజ్ నివాళి
కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పట్టణ ప్రముఖ ఆర్యవైశ్యులు గ్రంధి యానాశెట్టి భౌతికకాయాన్ని కావలి లోని వారి నివాసం నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ దర్శించి, పూలమాల వేసి నివాళలర్పించారు.. వారి వెంట కావలి టీడీపీ నాయకులు ఉన్నారు.
అబ్దుల్ అజీజ్ తో డ్యాన్స్ మాస్టర్ జానీ భేటీ..
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ సోమవారం నెల్లూరు నగరంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక రాజకీయ అంశాల పై చర్చించారు. ఆయన తో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఉన్నారు.
టీడీపీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండండి
- నారాయణ, అజీజ్, కోటంరెడ్డి
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నిత్యం ప్రజల్లో ఉండాలని నారాయణ, అజీజ్ కోటంరెడ్డి సూచించారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లు 49,50,52,53,54 డివిజన్ ల స్థాయి ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాబు ష్యూరిటీ - భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం పురోగతిపై చర్చించారు. పలు కీలక అంశాలతో టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఘంటాపథంగా చెప్పారు.
అక్రమ మైనింగ్ తో వందల కోట్ల దోపిడీ జరుగుతుంది....
అక్రమ మైనింగ్ పూర్తిగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది...
అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటే హర్షిస్తాం...
చర్యలు తీసుకోకుంటే డీ డీ వ్యాఖ్యల పై హై కోర్టు ను ఆశ్రయిస్తాం...
- అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు నిరసనగా జిల్లా టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు...
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..
సర్వేపల్లి లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను నిరసిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న నిరసన దీక్ష తెలిసి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారని ధ్వజమెత్తారు..
జే సీ సమక్షంలో మైనింగ్ డీడీ సర్వేపల్లి లో జరుగుతుండేది అక్రమ మైనింగె నని స్పష్టం చేసినట్లు మీడియా కి తెలిపారు.
అక్రమ మైనింగ్ తో వందల కోట్ల దోపిడీ జరుగుతుందని, మైనింగ్ స్థలంలో భారీ పేలుడు పదార్థాలు, 40 కు పైగా జే సీ బీ లు ఉన్నాయని అన్నారు..
పూర్తిగా వైసీపీ నాయకుల కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, అధికారులు పోలీసులు పట్టుకోవాల్సిన వాటిని మేము పట్టుకుని చూపించినా అధికారుల లో చలనం లేకపోవడం దుర్మార్గం అని అవేదన వ్యక్తం చేశారు..
డీడీ మైనింగ్ వారు రేపటిలోగా చర్యలు తీసుకుంటామని తెలిపారని చర్యలు తీసుకోకపోతే పోరాటం ఆగదని తెలిపారు.
ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...
సహజ సంపదలను వైసీపీ నేతలు స్మగ్లింగ్ చేస్తూ, వందల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లకొడుతున్నారని విమర్శించారు...
సర్వేపల్లి నియోజవర్గం లో క్వారీ ఓనర్ ను సైతం బెదిరించి బరితెగించి అక్రమ మైనింగ్ చేస్తుంటే అధికారుల లో చలనం లేదని అన్నారు..
సోమిరెడ్డి నిరసనకు మద్దతుగా అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ ను కలిశామని, జాయింట్ కలెక్టర్ సమక్షంలో అబ్దుల్ అజీజ్ ప్రశ్నలకు సమాధానం గా అది అక్రమ మైనింగే నని మైనింగ్ డీ డీ తెలిపారని అన్నారు.
మైనింగ్ డీ డీ చర్యలు తీసుకుంటామని తెలిపారని, చర్యలు తీసుకుంటే హర్షిస్తామని, చర్యలు తీసుకోకుంటే డీ డీ అక్రమ మైనింగే నని చెప్పిన వీడియోల తో హై కోర్టు ను ఆశ్రయిస్తామని, జిల్లా స్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు
కోవూరు నియోజకవర్గ ఇంఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రాజా నాయుడు, జెన్నీ రమణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, చెముకుల కృష్ణ చైతన్య, భూలక్ష్మి, అమ్రుల్లా, దర్శి హరి కృష్ణ, సుబ్రహ్మణ్యం, వెంకట శేషు తదితరులు పాల్గొన్నారు..
అక్రమ మైనింగ్ పై జాయింట్ కలెక్టర్ ను కలిసిన టీడీపీ నేతలు
టీడీపీ అధికారంలోకి రాగానే శాశ్వత ఇంటి పరిష్కారం చుపుతాం
- నారాయణ, అబ్దుల్ అజీజ్
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాశ్వత ఇంటి పరిష్కారం చూపుతామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 వ డివిజన్లోని అహమద్ నగర్ లో నారాయణ, అబ్దుల్ అజీజ్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టామని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాటిని పేద ప్రజలకు ఇవ్వకుండా రాక్షసానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు మంజూరు అయిన వారికి ఇంటి తాళాలు ఇస్తామని, మంజూరు కానీ వారికి కొత్తగా మంజూరు చేసి తాళాలు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. భవిష్యత్తు లో ఇక్కడ ఎవరు వరదలు, వర్షాలు వల్ల ఇబ్బంది పడి బాధపడాల్సిన అవసరం ఉండదని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడాల మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు, షంశీర్ తదితరులు పాల్గొన్నారు
ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించండి
- నారాయణ, అబ్దుల్ అజీజ్
టీడీపీ శ్రేణులు ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించాలని మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు 44, 45, 46, 48 డివిజన్ లతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ పై సమీక్ష నిర్వహించి, కుటుంబ సాధికార సారధుల నియామకం పై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ మనం అధర్మం తో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరం యుద్ధం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ కి అనుకూల వాతావరణం ఏర్పడిందని దానిని మనం ఉపయోగించుకోవాలని ప్రజా ప్రభుత్వ ఏర్పాటు కు కృషి చేయాలని సూచించారు.
పంచభూతాలను దోచుకునే వైసీపీ నాయకులు ఎలాగైనా బతుకుతారు. కార్మికులు జీతాలతోనే బతకగలరు - అబ్దుల్ అజీజ్
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Website
Address
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat